ఉత్తర భారత కాశీ యాత్రా సమాచారము వివరములు.
మహానుభావులు, ఋషులు, అఘోరాలు,పండితులు, పామరులు, దేవతలు, భూతములు, అసురులు, పితృదేవతలు, గాణాపత్యులు,శైవులు, శాక్తేయులు, సౌరమానులు, వైష్ణవులు, సాధకులు, సాధువులు, ఇలా సకల జగత్తు సేవించుకునే దర్శించుకునే పరమపావన పుణ్యక్షేత్రం కాశీపురి.
కాశీ క్షేత్రములో
నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల వివరములు.
II హర హర మహాదేవ II
→→సంపూర్ణ ఉత్తరభారత కాశీ యాత్ర వివరాలు
ll అయోధ్య ll
ll శ్రీరామ జన్మభూమి. ll
అయోధ్యలో చూడదగిన ప్రదేశములు...........
1.సరయూ నదీ స్నానము. 2. శ్రీ రామ జన్మభూమి హనుమాన్ గుడి.
దీన్నే హనుమాన్ గడి అని కూడా అంటారు.
అదేవిధంగా
3. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ప్రదేశము.
4. సీతమ్మ వంట శాల దీన్నే పాకశాల అని అనవచ్చు.
5. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రదేశం.
6. ఇంకా రాముడు నడయాడిన అనేక ప్రదేశములను ఇక్కడ చూడవచ్చును.
త్రేతాయుగంలో రాముడు భరతావనిని పరిపాలించిన భారత రాజధాని.
రఘు రాముడు నడయాడిన పవిత్ర భూమి.
శ్రీ రామ నామం అమృతం వలె ప్రతిధ్వనించిన అమృతమైయిన నేల...............
II శ్రీరామ శ్రీరామ శ్రీరామ II
గయా క్షేత్రము
గయా - బుద్ధగయ.
బీహార్.
శ్రీమన్నారాయణుడు గయాసుర సంహారము జరిపిన ప్రదేశం.
పూర్వకాలంలో గయాసురుడు అనే అసురుని నుంచి భగవానుడైన శ్రీమన్నారాయణుడు లోకాన్ని కాపాడటం కొరకు అతని నెత్తిపై తన పాదం మోపి నేలలోకి అణగదొక్కి లోకాలను కాపాడినాడు.
గయా క్షేత్రములో దర్శించ దగిన ప్రదేశములు.
మంగళ గౌరీ - అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఫల్గుణీ నది.
వట వృక్షము.
విష్ణుపాదము.
బుద్ధగయ - బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశము.
బుద్ధగయ లో అనేక బౌద్ధారామాలు ఉన్నవి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల తరఫున
అనేకములైన బౌద్ధారామాలు ఉన్నవి
ఇందులో ముఖ్యంగా బుద్ధునికి జ్ఞానోదయం అయిన బోధివృక్షమును అందరూ తప్పక దర్శిస్తారు.
ll ప్రయాగరాజము ll
అలహాబాదు కుంభమేళా జరుగు ప్రదేశం.
అలహాబాదులో దర్శించ తగిన ప్రదేశములు
గంగా యమునా సరస్వతి సహిత త్రివేణి సంగమము.
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి శక్తి పీఠం.
బడా హనుమాన్ అని పిలువబడే హనుమాన్ మందిరము.
నెహ్రూ గారి ఇల్లు ఆనంద్ భవన్ గా ప్రసిద్ధి చెందినది.
త్రివేణి సంగమం వద్ద యాత్రికులు అందరూ
తమ యాత్రలో భాగంగా
మన మన లేక తమ తమ పెద్దలైన
పూర్వీకుల అందరికీ
శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.
త్రివేణి సంగమమునకు
దంపతులుగా దర్శనార్థులుగా వచ్చిన దంపతులు
వేణి దానము అనగా దంపతులుగా చేసే వేణీ పూజ చేయించుకుంటారు.
మాధవేశ్వరి అమ్మవారికి
ఒడిబియ్యం పోయడం మన తెలుగు వారి సంప్రదాయం.
సీతా మడి
సీతా మడి లేక సీతా మర్హి అన్న పేర్లతో పిలువబడే సీతా మడి దర్శనీయ స్థలం.
సీతా మడి దగ్గర అతి పెద్దదయిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
రామాయణ గాథ లో చెప్పబడిన విధంగా........
వాల్మీకి మహాముని ఆశ్రమము గంగానది ఒడ్డున ఇక్కడే ఉండేది ఇక్కడే లవకుశులు జన్మించారు. ఇక్కడే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసినారు.
సీతమ్మవారు భూమి లోపలికి ప్రవేశించిన ప్రదేశాన్ని ప్రస్తుతం
సీతా మడి గా పిలుస్తారు.
ద్వాదశాదిత్యులు.
ద్వాదశ జ్యోతిర్లింగములు.
అష్టాదశ శక్తి పీఠములు.
అష్ట భైరవ యాత్ర.
అష్ట గణపతుల యాత్ర.
పంచ గంగా స్నానములు.
మణికర్ణికా స్నానము.
అకార ఉకార మకార అనబడే ఓంకార ఆలయములు.
ఇలా కాశి క్షేత్రం లో చూడదగిన అనేక ప్రదేశములు ఉన్నవి.
అయితే కాలక్రమంలో గర్భవాస దోష నివృత్తి కొరకు పది నెలల కాశీ వాసము చేయవలెనని ఉన్నప్పటికీ కాలక్రమంలో ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వారు కనీసం పది రోజులు పూర్తి చేస్తున్నారు.
ఈ విధంగా గర్భవాసం దోష నివృత్తి కొరకు పది నెలల
కాశీ వాసము గడప వలెను.
ఈ విధంగా చేయదగిన యాత్ర కొరకు పది రోజులు
తొమ్మిది నిద్రల కాశీ వాసము తో కూడిన
పూర్తి 12 రోజుల యాత్రను ప్యాకేజీగా చేస్తున్నాము.
నాకు ఉన్న పరిజ్ఞానంతో నాకు తెలిసిన అనుభవం లో ఉన్న అన్ని వివరాలను ఇక్కడ పొందుపరచాను .
ఏదైనా ఇతర వివరాలు కావాల్సి వస్తే తప్పక నన్ను ఫోన్ కాల్ యందు గాని స్వయంగా గాని సంప్రదించగలరు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి